`ఇప్పటి కింకా నా వయసు నిండా పదహారే..` అంటూ `పోకిరి` చిత్రంతో సంచలనం సృష్టించింది ముమైత్ఖాన్. ఆ తరువాత కూడా ప్రత్యేక ఐటమ్ గీతాల్లో నర్తించి హాట్ ఫేవరేట్గా నిలిచింది. గత కొంత కాలంగా ముమైత్కు అవకాశాలు లేవు. దీంతో పూర్తిగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తోంది. తాజాగా ఓ క్యాబ్ డ్రైవర్ కారణంగా వార్తల్లో నిలిచింది.
కార్లో గోవా వెళ్లి ఎంజాయ్ చేసిన ముమైత్ఖాన్ క్యాబ్ డ్రైవర్కు డబ్బులు ఎగవేసిందని సదరు క్యాబ్ డ్రైవర్ మీడియాకెక్కి రచ్చ చేశాడు. దీంతో ముమైత్ పేరు మళ్లీ వార్తల్లో నిలిచింది. తన కారుని వాడుకుని తనని మోసం చేసిందని సదరు క్యాబ్ డ్రైవర్ ముమైత్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అయితే క్యాబ్ డ్రైవర్ తనని హత్య చేయాలని ప్రయత్నించాడని, అది తెలియకుండా మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ముమైత్ఖాన్ పంజాగుట్ట పోలీసుల్ని ఆశ్రయించింది.
ర్యాష్ డ్రైవింగ్తో తనని భయాందోళనకు గురిచేశాడని, క్యాబ్ డ్రైవర్ తప్పుడు ఆరోపణలు చేశాడని మండిపడింది. క్యాబ్ డ్రైవర్ని మోసం చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో వున్నానని, తన గురించి అందరికి తెలుసని, నా పరువుకి భంగం కలిగించేలా వార్తా కథనాల్ని ప్రసారం చేశారని, తన క్యారెక్టర్ని జడ్జ్ చేసే అధికారం వారికి ఎక్కడిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాబ్ డ్రైవర్కు 23500 చెల్లించానని వెల్లడించింది.