Homeటాప్ స్టోరీస్ముఖేష్ గౌడ్ కన్నుమూత

ముఖేష్ గౌడ్ కన్నుమూత

Mukesh Goud
Mukesh Goud

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూశారు. గతకొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ముఖేష్ గౌడ్ చికిత్స పొందుతూ అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు కొద్దిసేపటి క్రితం. అసలే మాజీ కేంద్రమంత్రి ఎస్. జైపాల్ రెడ్డి నిన్ననే మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొనగా ఈరోజు ముఖేష్ గౌడ్ మరణించడంతో కాంగ్రెస్ శ్రేణులు షాక్ కి గురయ్యాయి. క్యాన్సర్ వ్యాధి కి తగిన చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. గత ఎన్నికల్లో గోశామహల్ నుండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసాడు కానీ బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ చేతిలో ఓడిపోయాడు.

కాంగ్రెస్ పార్టీలో చివరి వరకు కొనసాగిన నేత ముఖేష్ గౌడ్ దాంతో ముఖేష్ అంటే కాంగ్రెస్ శ్రేణులకు అమితమైన గౌరవం. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ని వీడి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని గుసగుసలు వినిపించాయి కానీ ముఖేష్ మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడలేదు. ముఖేష్ గౌడ్ కు ఇద్దరు కుమారులు , ఒక కూతురు కాగా విక్రమ్ గౌడ్ ముఖేష్ గౌడ్ కొడుకన్న విషయం తెలిసిందే. అలాగే ముఖేష్ గౌడ్ మాజీ మంత్రి టి. దేవేందర్ గౌడ్ కు స్వయానా మేనల్లుడు. ముఖేష్ గౌడ్ మృతికి పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All