Homeటాప్ స్టోరీస్చంద్రబాబు కు వార్నింగ్ ఇచ్చిన విజయసాయి రెడ్డి

చంద్రబాబు కు వార్నింగ్ ఇచ్చిన విజయసాయి రెడ్డి

Vijaya sai reddy and Chandrababu naidu
Vijaya sai reddy and Chandrababu naidu

ప్రస్తుతం ఉంటున్న ఇంటిని తక్షణం ఖాళీ చేయాల్సిందే అంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు ఎంపీ విజయసాయి రెడ్డి . ప్రస్తుతం చంద్రబాబు నాయుడు లింగమనేని ఎస్టేట్ లో ఉంటున్న విషయం తెలిసిందే . ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు , అయితే కరకట్ట కు ముందు కట్టిన అక్రమ  కట్టడమని తెలిసి కూడా  చంద్రబాబు ఆ ఇంట్లో ఉంటున్నాడని కాబట్టి తక్షణం ఖాళీ చేయాల్సిందిగా డిమాండ్ చేసాడు విజయసాయి రెడ్డి

లింగమనేని ఎస్టేట్ ని కూడా కూల్చడం ఖాయమని , ప్రభుత్వం జోక్యం చేసుకోకముందే హుందాగా ఖాళీ చేస్తే గౌరవంగా ఉంటుందని , లేకపోతే అవమానం తప్పదని హెచ్చరికలు జారీ చేసాడు విజయసాయి రెడ్డి . జగన్ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే చంద్రబాబుని లింగమనేని ఎస్టేట్ నుండి కూడా తరిమేలా కనిపిస్తున్నారు . ఇప్పటికే ప్రజావేదిక ని కుప్పకూల్చిన విషయం తెలిసిందే

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All