బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడని నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావడం కానీ, సినిమాల్లో నటించడం కానీ ఇష్టం లేదని, అందుకే అతని ఎంట్రీకి సంబంధించిన సినిమా వార్తలు వినిపించడం లేదని గత కొన్ని రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్లో వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో నందమూరి అభిమానుల్లో కలవరం మొదలైంది. బాలయ్య వారసుడు సినిమాల్లోకి రావడం కలేనా? అని నిట్టూర్చడం మొదలుపెట్టారు.
సింగీతం శ్రీనివాసరావు రూపొందించాలనుకున్న `ఆదిత్య 999` ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ వుంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది ఆ సినిమా పక్కన పెట్టడంతో అది కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి ఇక ఈ ఏడాది ఉండొచ్చు అని సర్దిచెప్పుకుంటూ వస్తున్నారు. బాలయ్య కూడా కొడుకు ఎంట్రీపై ఏమీ మాట్లాడటం లేదు. దీంతో మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కలగానే మిగిలిపోనుందని అంతా భావించారు. కానీ బాలయ్య మాత్రం కొడుకుని ఖచ్చతంగా సినిమాల్లోకి దింపాల్సిందేనిని కంకణం కట్టుకున్నాడట.
తాజాగా అతన్ని న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో మూడు నెలల శిక్షణ కోసం అమెరికా పంపించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాదే వుంటుందన్నమాటే. వుంటే దానికి దర్శకుడు ఎవరు. క్రిష్ వుంటాడా? లేక బోయపాటి శ్రీను రేసులో వుంటాడా అన్న విషయాల్లో మాత్రం క్లారిటీ లేదు. అప్పట్లో మోక్షజ్ఞని క్రిష్ హీరోగా పరిచయం చేస్తాడని వార్తలు వినిపించాయి. అదే నిజమౌతుందోమో చూడాలి.