దృశ్యం.. మోహన్లాల్, మీనా జంటగా నటించిన ఈ చిత్రం 2013 డిసెంబర్ 19న విడుదలైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు వెంకటేష్ చేసిన ఈ చిత్రాన్ని తమిళంలో కమల్హాసన్ చేశారు. హిందీలో అజయ్ దేవగన్ నటించారు.
ఇన్నేళ్ల తరువాత ఈ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ గురువారం (21న) మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ పుట్టిన రోజు. ఇదే రోజున సూపర్హిట్ చిత్రం `దృశ్యం`కు సీక్వెల్గా `దృశ్యం – 2`ని నిర్మించబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన టైటిల్ టీజర్ని హీరో మోహన్లాల్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు.
`దృశ్యం`కు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ సీక్వెల్కు దర్శకత్వం వహించబోతున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ సమర్పణలో ఆంటోనీ పెరంబువార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లాక్డౌన్ తరువాత పరిస్థితులని బట్టి సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. మోహన్లాల్ నటించిన `లూసీఫర్` చిత్రాన్ని తెలుగులో మెగాహీరో చిరంజీవి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
#Drishyam #Drishyam2 pic.twitter.com/OHnue7P5uw
— Mohanlal (@Mohanlal) May 21, 2020
Credit: Twitter