ఆదిత్య క్రియేషన్స్ బ్యానర్పై లక్ష్మీ శ్రీవాస్తవ స్వీయ నిర్మాణంలో కృష్ణంరాజు ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం `గుండమ్మకథ`. ఆదిత్య, ప్రణవ్య జంటగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతల్ని నిర్వర్తించడంతో పాటు లక్ష్మీ శ్రీవాస్తవ స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ని చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది.
ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, కామెడీ అంశాల మేళవింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో విడుదల చేసిన టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్కి మంచి ఆదరణ లభించింది. అదే ఉత్సాహంతో తాజాగా గుండమ్మకథ ట్రైలర్ని రిలీజ్ చేశారు. కరోనా నేపథ్యంలో థియేటర్స్ లాక్డౌన్ ముగిసిన వెంటనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత వెల్లడించారు.
`అలనాటి గుం్డమ్మకథ తరతరాలు తెలుగు సినీ ప్రేక్ష్లకుల్ని ఏరీతిన అలరిస్తుందో అదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఈ మోడ్రన్ గుండమ్మ కథని రెడీ చేశాం. ఈ సినిమాతో ఆదిత్యను హీరోగా, ప్రణవ్యని హీరోయిన్గా పరిచయం చేస్తున్నాం. ఫ్యామిలీతో హాయిగా చూసేలా ఉండే సినిమా ఇది` అని దర్శకనిర్మాతలు వెల్లడించారు.