బాలీవుడ్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ `మిషన్ మజ్ను`. శంతన్ బాగ్చి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తోంది. పాకిస్తాన్లో ఇండియన్ ఆర్మీ సీక్రెట్గా నిర్వహించిన మిషన్ ఆధారంగా ఈ మూవీని రకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఉత్తర ప్రదేశ్లోని లఖ్నవులో మొదలైంది.
1970ల నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సిద్ధార్ధ్ మల్హోత్రా ఇందులో రా ఏజెంట్గా కనిపించనున్నారు. ఆర్ ఎస్ వీపీ బ్యానర్పై రోనీ స్క్రూ వాలాతో కలిసి అమర్ బుటాలా, గరిమా మెహతాలు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా రష్మిక ఆసక్తికర విషయాల్ని పంచుకుంది.
రష్మిక మాట్లాడుతూ `అన్ని భాషల్లో ప్రేక్షకుల అభిమానాన్ని పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓ నటిగా నేను అందరికి చేరువయ్యే చిత్రమిది. సినిమాకు భాష ఏ మాత్రం అవరోధం కాదు. `మిషన్ మజ్ను`లో నటిస్తుండటం ఆనందంగా వుంది. ముఖ్యంగా ఈ మూవీతో బాలీవుడ్లో నా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా వుంది` అని తెలిపింది.
The first chapter of one of India’s deadliest covert operations begins today! #MissionMajnu commences shoot in Lucknow. @SidMalhotra @iamRashmika @RonnieScrewvala @amarbutala #GarimaMehta @GBAMedia_Off #ShantanuBagchi @aseem_arora @Sumit_Batheja #ParveezShaikh @pashanjal pic.twitter.com/UXC93euf4m
— RSVP Movies (@RSVPMovies) February 6, 2021