Homeటాప్ స్టోరీస్ల‌ఖ్‌న‌వూలో ప్రారంభ‌మైన ర‌ష్మిక `మిష‌న్ మ‌జ్ను`!

ల‌ఖ్‌న‌వూలో ప్రారంభ‌మైన ర‌ష్మిక `మిష‌న్ మ‌జ్ను`!

ల‌ఖ్‌న‌వూలో ప్రారంభ‌మైన ర‌ష్మిక `మిష‌న్ మ‌జ్ను`!
ల‌ఖ్‌న‌వూలో ప్రారంభ‌మైన ర‌ష్మిక `మిష‌న్ మ‌జ్ను`!

బాలీవుడ్ హీరో సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తున్న స్పై థ్రిల్ల‌ర్ `మిష‌న్ మజ్ను`. శంత‌న్ బాగ్చి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ద్వారా క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. పాకిస్తాన్‌లో ఇండియ‌న్ ఆర్మీ సీక్రెట్‌గా నిర్వ‌హించిన మిష‌న్ ఆధారంగా ఈ మూవీని ర‌కెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ల‌ఖ్‌న‌వులో మొద‌లైంది.

1970ల నాటి వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా ఇందులో రా ఏజెంట్‌గా క‌నిపించ‌నున్నారు. ఆర్ ఎస్ వీపీ బ్యాన‌ర్‌పై రోనీ స్క్రూ వాలాతో క‌లిసి అమ‌ర్ బుటాలా, గ‌రిమా మెహ‌తాలు నిర్మిస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా ర‌ష్మిక ఆస‌క్తిక‌ర విష‌యాల్ని పంచుకుంది.

- Advertisement -

ర‌ష్మిక మాట్లాడుతూ `అన్ని భాష‌ల్లో ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొంద‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓ న‌టిగా నేను అంద‌రికి చేరువ‌య్యే చిత్ర‌మిది. సినిమాకు భాష ఏ మాత్రం అవ‌రోధం కాదు. `మిష‌న్ మ‌జ్ను`లో న‌టిస్తుండ‌టం ఆనందంగా వుంది. ముఖ్యంగా ఈ మూవీతో బాలీవుడ్‌లో నా ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా వుంది` అని తెలిపింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All