బాలకృష్ణ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంపై, తెలుగు సినిమా ఇండస్ట్రీ కీలక వర్గాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇండస్ట్రలో సంచలనంగా మారాయి. మీటింగ్ల పేరుతో హైదరాబాద్లో మంత్రి తలసానితో చేరి భూములు పంచుకుంటున్నారా? అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పందించారు.
`ఈ రోజు సినిమా, టీవి పరిశ్రమలకు సంబంధించిన అంశాలపై చర్చజరిగింది. లాక్డౌన్ తరువాత షూటింగ్లను ఎలా ప్రారంభించాలి అన్నదానిపై నిన్ని, ఈ రోజు విధి విధానాలను రూపొందించాం. షూటింగ్లు పునః ప్రారంభంపై చర్చ జరిగింది. 24 క్రాఫ్ట్లకు సంబంధించిన అంశాలపై కూలంకశంగా చర్చించాం. ఈ అంశాలన్నింటిని ముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకెళతాను. షూటింగ్లకు అనుమతి ఎప్పుడు ఇస్తామనేది తెలియజేస్తాం. పోస్ట్ ప్రొడక్షన్స్కు ఇప్పటికే అనుమతులిచ్చాం. ఇప్పుడప్పుడే థియేటర్లు తెరిస్తే కొన్ని సమస్యలున్నాయి. థియేటర్లు తెరవాల్సిన సమయం వచ్చినప్పుడు వాటిపై చర్చిస్తాం. ఇక బాలకృష్ణ వ్యాఖ్యలను చూసిన తరువాతే స్పందిస్తా. ఆయనన అలా ఎందుకు అన్నారో తెలుసుకుంటా. ఆ విజువల్స్ ఇప్పటికి కాదని కొందరు అంటున్నారు.
అసలు ఏం జరిగింతదో తెలుసుకుంటా. సమావేశాలకు ఇండస్ట్రీలో వున్న వాళ్లందరిని పిలవలేదు. ఎవరైతే చురుగ్గా వున్నారో వారినే పిలిచాం. ఇది నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిబిటర్లకు సంబంధించిన అంశం. అందుకే వాళ్లతో మాట్లాడాం. అందరిని పిలిచి సమావేశం పెట్టాలని ఎవరైనా అంటే అందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు` అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.