కరోనా మహమ్మారి హైదరాబాద్ ని వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా విళయతాండవం చేస్తోంది. ముంబై, చెన్నై , గుజరాత్ లలో విజృంభిస్తున్న కరోనా హైదరాబాద్ నూ అల్లాడిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల్నీ వెంటాడుతోంది.
కరోనా ప్రబలుతున్న వేళ ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటున్నారు . దీంతో వాళ్లలో కొంతమంది కరోనా బారిన పడక తప్పడం లేదు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి .. ఆయన కుటుంభం కరోనా భారిన పడ్డారు. ఆయన కారణంగా నిజామా బాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా కోరినా బారిన పడటం తెలంగాణ ప్రజాప్రతినిధుల్లో కలవరం కలిగిస్తోంది.
ఇదిలా ఉంటే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఓఎస్డీ గంగాధర్ కరోనా బారిన పడటం మరింత భయాందోళన కలిగిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఓఎస్డీ గంగాధర్ పాల్గొనడంతో మరింత మంది అధికారులు కరోనా భారిన పడతారేమోనని భయాందోళనలు వ్యక్త మవుతున్నాయి.
- Advertisement -