టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత `ఆహా ఓటీటీ కోసం `సామ్ జామ్` పేరుతో టాక్ షో ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. డిజిటల్ ఫ్లాట్ ఫామ్లలో వేరియేషన్ని చూపించి కొత్త తరహా టాక్ షోలు..సినిమాలతో ఆకట్టుకోవాలని టాక్ షోని ప్రారంభించారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎపిసోడ్తో ఈ టాక్ షో మొదలైంది. ఆ తరువాత రానా, నాగ్ అశ్విన్, సైనా నెహ్వాల్ల జోడీ ఈ టాక్షోలో పాల్గొన్నారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి ఈ షోలో కనిపించబోతున్నారు.
దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా `ఆహా` రిలీజ్ చేసింది. సామ్ జామ్ ద్వారా మెగా స్టార్ చిరంజీవి తన ఆలోచనలను అభిమానులతో పంచుకోబోతున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 25 న `ఆహా`లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మోగా ఎపిసోడ్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్కి సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తయింది.
ఇప్పటికే ఈ షోలో పాల్గొన్న చాలా మంది స్టార్స్ తమ అంతరంగాన్ని ఆవిష్కరించి ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు. ఇదే సమయంలో హోస్ట్గా వ్యవహరిస్తున్న సమంత వారిని ఆటపట్టించింది కూడా. మరి మెగాస్టార్తో సామ్ ఎలా వ్యవహరించింది… చిరంజీవి ఎలాంటి విషయాల్ని సామ్తో షేర్ చేసుకున్నారన్నది చూడాలంటే ఈ నెల 25 వరకు వేచి చూడాల్సిందే.