ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. సురేందర్రెడ్డి అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమా తరువాత వెంటనే మెగాస్టార్ చిరంజీవి మరో చిత్రాన్ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్రెడ్డితో కలిసి రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దర్శకుడు కొరటాల శివకు అభ్యుదయ భావాలు ఎక్కువ. కుటుంబ నేపథ్యం కూడా అదే కావడంతో తొలి సినిమా నుంచి ఏదో ఒక సందేశాన్ని, సామాజిక అంశాన్ని తన సినిమాలో చూపిస్తూ వస్తున్నారు. తాజా చిత్రాన్ని నక్సలిజం నేపథ్యంలో అంత్యంత శక్తివంతమైన కథతో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారని ప్రచారంజరుగుతోంది. ఇటీవలే రెజీనా, చిరులపై ఓ స్పెషల్ సాంగ్తో సినిమాని ప్రారంభించారు. చిత్రీకరణ పూర్తయింది.
త్వరలో కోకా పేటలో 40రోజుల పాటు షూటింగ్ చేయబోతున్నారు. అక్కడ భారీ షెడ్యూల్ని ప్లాన్ చేసిన కొరటాల శివ ఈ షెడ్యూల్ కోసం 20కోట్ల వ్యయంతో ఓ కాలనీ సెట్ని నిర్మించారట. ఇందులోనే కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్టు తాజా సమాచారం. దీని తరువాత మరో షెడ్యూల్ వుంటుందని చిత్రాన్ని 99 డేస్లో పూర్తి చేయాలని చిరు ప్రామిస్ చేయించుకోవడంతో ఉరుకుల పరుగుల మీద సినిమా షూటింగ్ చేస్తున్నారట.