ఇన్నేళ్ల ఉగాదికి ఈ ఏడాది ఈ బుధవారం వచ్చే ఉగాదికి ఎంతో ప్రత్యేకత వుంది. ఓ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న పండగ ఇది. మునుపెన్నడూ ఈ పరిస్థిని జనం ఎదుర్కోని దశలో వస్తున్న పండగ ఇది. ప్రపంచం ఒక్కసారిగా భయాణక వాతావరణంలోకి బలవంతంగా నెట్టివేయబడ్డ క్షణాలివి. ఈ విపత్కర పరిస్థితుల్లో వస్తున్న ఈ ఉగాది వంద కోట్లకు పైబడిన భారతీయుల జీవితాల్లో వెలుగులు నింపుతుందో లేక కారుచీకట్లకు స్వాగతం పలుకుతుందో తెలియని అయోమయ స్థితి ఇది.
ఈ ఉగాది రోజున అంటే బుధవారం మెగాప్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంటరవ్వబోతున్నారు. ఈ ఉగాది సందర్భంగా ఆయన కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఓ వీడియో సందేశం ద్వారా కొణిదెల ప్రొడక్షన్స్ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత కొంత కాలంగా చిరు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడా అవసరం పడింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
`నేను ఇక నుంచి నేను కూడా సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుదామని అనుకుంటున్నాను. అందుకు కారణం ఎప్పటికప్పుడు నా భావాలను నా అభిమానులతో షేర్ చేసుకోవాడానికి, నును చెప్పాలనుకున్న మెస్సేజ్లను ప్రజలతో చెప్పుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా భావిస్తున్నా. నేను ఈ ఉగాది రోజు నుంచి సోషల్ మీడియాలోకి ఎంటరవుతున్నాను. అని చిరు తెలిపారు.
This Ugadi is going to be special. Tomorrow, your Mega Star Chiranjeevi garu is going to start interacting with you from his official social media handles. Get ready to follow and show him some love.#WelcomeMegaStarToSM pic.twitter.com/2PwDM0TT7J
— Konidela Pro Company (@KonidelaPro) March 24, 2020
Credit: Twitter