మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాతో నటనపరంగా పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. సైరా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కి తగ్గట్టుగా కలెక్షన్స్ ని రాబట్టడంలో చేతులెత్తేసింది. ఇక పరభాషా కలెక్షన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది.
తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు బయ్యర్లకు సినిమా లాభాలు అందించలేకపోయింది. ఇకపోతే నెక్స్ట్ కొరటాల సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని మెగాస్టార్ పక్కా ప్లానింగ్ తో రెడీ అవుతున్నాడు. అపజయం లేని దర్శకుడు కమర్షియల్ ఎలిమెంట్స్ తో మంచి స్టోరీని రెడీ చేసి ఉంచాడు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. ఇకపోతే సినిమాకు సంబందించిన రూమర్స్ లిస్ట్ అయితే పెద్దగానే ఉంది.
నక్సల్స్ కి సంబదించిన కాన్సెప్ట్ కూడా సినిమాలో ఉన్నట్లు కథనాలు చాలానే వచ్చాయి. అయితే అది నిజమేనని తెలుస్తోంది,. మెగా సన్నిహితుల సమాచారం ప్రకారం సినిమాలో ఒక షెడ్యూల్ ని అడవుల్లో ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నక్సల్స్ కి సంబందించిన సీన్స్ నెల రోజుల పాటు తెరకెక్కించనున్నారట. సినిమాలో ఆ సీన్స్ హైలెట్ గా నిలిచేలా కొరటాల హెవీ ఎమోషన్స్ తో డిజైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న దర్శకుడు మరికొన్ని రోజుల్లో సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నాడు. ఇక సినిమాలో దాదాపు నక్సల్స్ అనే కాన్సెప్ట్ ఉన్నట్లు తేలిపోయింది. ఇక రామ్ చరణ్ కీ రోల్ – త్రిషా హీరోయిన్ అనే కథనాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక తెలుగమ్మాయి ఈషా రెబ్బ కూడా సినిమాలో ఒక కీలకపాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్ వస్తోంది. వీటన్నిటిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.