Homeటాప్ స్టోరీస్మెగాస్టార్ ప్లానింగ్‌ మామూలుగా లేదుగా!

మెగాస్టార్ ప్లానింగ్‌ మామూలుగా లేదుగా!

మెగాస్టార్ ప్లానింగ్‌ మామూలుగా లేదుగా!
మెగాస్టార్ ప్లానింగ్‌ మామూలుగా లేదుగా!

సీనియ‌ర్ హీరోలు.. స్టార్ హీరోలు ఏడాదికి ఒకే ఒక్క మూవీతో అభిమానుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డం పాత ప‌ద్ద‌తి.. ఇప్పుడు టైమ్ మారింది.. ఒకే హీరో ఏడాదికి వ‌రుస చిత్రాల‌తో హోరెత్తించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ రేసులో సీనియ‌ర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ముందు వ‌రుస‌లో నిలుస్తున్నారు. ఒక మూవీ సెట్స్ పై వుండ‌గానే మ‌రో మూడు చిత్రాల్ని అనౌన్స్ చేయ‌బోతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `ఆచార్య‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చ‌ర‌న్ తో క‌లిసి నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఏడు నెల‌లుగా ఆగిపోయిన ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్ నుంచి ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే చిరంజీవి మ‌రో మూడు చిత్రాల్ని లైన్‌లోకి తీసుకొస్తున్నారు.

- Advertisement -

`ఆచార్య‌` అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో వుండ‌గానే మ‌రో మూడు చిత్రాల్ని చేయ‌బోతున్నారు. త‌‌మిళ హిట్ చిత్రం `వేదాలం` రీమేక్‌తో పాటు మ‌ల‌య‌మాళ హిట్ మూవీ `లూసీఫ‌ర్‌` రీమేక్‌లో న‌టించ‌బోతున్నారు. `వేదాలం` రీమేక్‌ని మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ట్ చేయ‌బోతున్నారు. `లూసీఫ‌ర్‌` రీమేక్‌ని వీవీ వినాయ‌క్ డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ఈ రెండు చిత్రాల‌తో పాటు త్రివిక్ర‌మ్ లేదా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రాన్ని చేయ‌బోతున్నార‌ట‌. ఈ ఇద్ద‌రితో సినిమాలు చేయాల‌ని చిరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All