మెగా ఫ్యామిలీ హీరోలు అంతా ఒకే చోట చేరితే ఫ్యాన్స్కి పండగే.. అదే ఫెస్టివెల్ సందర్భంగా ఒకే చోట చేరి సందడి చేస్తే ఇంకే ముందు ఆ దృశ్యం చూసి ఫ్యాన్స్ ఆనందంతో చిందులేయరూ.. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఇలాంటి సెలబ్రేషనే చేసుకుంటున్నారు. నేడు క్రిస్మస్. ఈ సందర్భంగా అంతటా క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మెగా ఇంట కూడా ఈ సంబరాలు అంబరాన్ని తాకాయి.
ముందుగా ఈ ఫెస్టివెల్ హంగామాని పవర్స్టార్ పవన్కల్యాణ్ ఆయన భార్య అన్నా లెజనోవా స్టార్ట్ చేశారు. ఫెస్టివల్ మరో రెండు రోజులండగానే తమకు అత్యంత సన్నిహితంగా వుండే వారికి క్రిస్మస్ గుడీస్ని కానుకలుగా పంపించారు. మహేష్ దంపతులకు పవన్ ఫ్యామిలీ ప్రత్యేకంగా క్రిస్మస్ కానుకల్ని పంపించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇండస్ట్రీలో వున్న మిగతా వారికి బహుమతుల్ని పంపించి క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇదే తరహాలో మగా ఫ్యామిలీకి చెందిన యంగ్ కపుల్స్, యంగ్ హీరోస్ అంతా కలిసి గురువారం రాత్రి క్రిస్మస్ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో రామ్చరణ్, బన్నీ, ఉపాసన, స్నేహరెడ్డి, సుష్మిత, విష్ణు ప్రసాద్, కొత్త జంట నిహారిక, చైతన్య, హీరో వరుణ్తేజ్, సాయిధరమ్తేజ్, వైష్ణవ్తేజ్, అల్లు శిరీష్, అల్లు వెంకట్ ( బాబీ) కల్యాణ్దేవ్, శ్రీజిత తదితరులు పాల్గొన్నారు. వీరికి సంబంధించిన గ్రూప్ ఫొటో నెట్టింట సందడి చేస్తోంది.