Homeటాప్ స్టోరీస్రిపబ్లిక్ కోసం కదలివస్తోన్న మెగా హీరోలు

రిపబ్లిక్ కోసం కదలివస్తోన్న మెగా హీరోలు

రిపబ్లిక్ కోసం కదలివస్తోన్న మెగా హీరోలు
రిపబ్లిక్ కోసం కదలివస్తోన్న మెగా హీరోలు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ విడుదలకు సిద్ధమైన విషయం తెల్సిందే. ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది. ఈరోజు రిపబ్లిక్ ట్రైలర్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరిగింది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

మాములుగా అయితే సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయాలి కానీ తేజ్ ఇంకా హాస్పిటల్ లో కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ ప్రమోషన్స్ కు దూరం కానున్నాడు. ఇప్పుడప్పుడే పబ్లిక్ లోకి వచ్చే రిస్క్ కూడా చేయలేడు. అందుకే తేజ్ తప్ప రిపబ్లిక్ కోసం మిగతా మెగా హీరోలంతా కదిలి వస్తున్నారు.

- Advertisement -

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రానున్నాడు. అంతే కాకుండా వరుణ్ తేజ్, శిరీష్, వైష్ణవ్ తేజ్ ఈవెంట్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్ వీడియో బైట్స్ ఇస్తారని తెలుస్తోంది. ఇలా మెగా హీరోలంతా కలిసి రిపబ్లిక్ ను ప్రజలకు చేరువ చేయాలని చూస్తున్నారు. తేజ్ కూడా వీడియో బైట్ ఇస్తాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All