Homeటాప్ స్టోరీస్చరణ్ కు అన్యాయం జరిగిందట !

చరణ్ కు అన్యాయం జరిగిందట !

Rangastalam
Rangastalam

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో రాంచరణ్ కు తీరని అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు . రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రానికి బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అవార్డు దక్కింది . అయితే అదే చిత్రంలో చరణ్ అద్భుతంగా నటించాడు . చెవిటి వాడిగా చరణ్ చూపిన అభినయానికి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు . రికార్డులు కట్టబెట్టారు కూడా .

అయితే అలాంటి చరణ్ కు ఏ అవార్డు కూడా దక్కలేదు దాంతో మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అలాగే నటన పరంగా కూడా మంచి మార్కులు లభించాయి . అయితే అవార్డులు మాత్రం లభించలేదు కాకపోతే ఒక అవార్డు మాత్రం దక్కింది . అయితే రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు వస్తాయేమో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All