Homeటాప్ స్టోరీస్మెగా డాట‌ర్ టీమ్‌కి క‌రోనా పాజిటివ్‌?

మెగా డాట‌ర్ టీమ్‌కి క‌రోనా పాజిటివ్‌?

మెగా డాట‌ర్ టీమ్‌కి క‌రోనా పాజిటివ్‌?
మెగా డాట‌ర్ టీమ్‌కి క‌రోనా పాజిటివ్‌?

మెగా ఫ్యామిలీ నుంచి చిరు పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. భ‌ర్త విష్ణుతో క‌లిసి `గోల్డ్ బాక్స్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ ` పేరుతో ఓ నూత‌న నిర్మాణ సంస్థ‌ని స్థాపించిన సుస్మిత  ఓ వెబ్ సిరీస్ నిర్మాణం కూడా ఇటీవ‌లే మొద‌లుపెట్టారు కూడా. ఈ వెబ్ సిరీస్‌కి `ఓయ్‌` ఫేమ్ ఆనంద్ రంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ గ‌త కొన్ని రోజులుగా హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.

మెగాస్టార్ స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి సురేఖ చేతుల మీదుగా ముహూర్తం జ‌రుపుకున్న ఈ వెబ్ సిరీస్ టీమ్‌కు క‌రోనా షాక్ త‌గిలిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కొన్ని ఎపిసోడ్స్ పూర్తి చేసిన టీమ్ క‌రోనా వైర‌స్ కార‌ణంగా షూటింగ్‌ని తాత్కాలికంగా ఆపేసిన‌ట్టు తెలిసింది. కార‌ణంగా యూనిట్ స‌భ్యుల్లోని ఒక‌రికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ రావ‌డ‌మేన‌ని తెలిసింది.

- Advertisement -

దీంతో స‌ద‌రు యూనిట్ మెంబ‌ర్‌తో క్లోజ్ కాంటాక్ట్ వున్న వారంతా క‌రోనా వైర‌స్ టెస్టులు చేయించుకుంటున్నార‌ట‌. టెస్టుల త‌రువాత వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేష‌న్‌లో వుండ‌మ‌ని సుస్మిత వెల్ల‌డించి షూటింగ్‌ని ఆపేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. `ఎక్స్ ఛేంజ్ ఆఫ్ ఫైర్` అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో ప్ర‌కాష్ రాజ్‌, సంప‌త్ రాజు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All