Homeటాప్ స్టోరీస్25 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం కోరుతున్న`మాస్ట‌ర్‌` నిర్మాత‌!

25 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం కోరుతున్న`మాస్ట‌ర్‌` నిర్మాత‌!

25 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం కోరుతున్న`మాస్ట‌ర్‌` నిర్మాత‌!
25 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం కోరుతున్న`మాస్ట‌ర్‌` నిర్మాత‌!

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన త‌మిళ‌ చిత్రం `మాస్ట‌ర్‌`. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని గ్జావియేర్ బ్రిట్టో నిర్మించారు. మాళ‌విక మోహ‌న‌న్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో విల‌న్‌గా కీల‌క పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ నెల 13న సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం అనూహ్య విజ‌యాన్ని సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సొంతం చేసుకుంది.

అయితే ఈ చిత్రాన్ని రిలీజ్‌కి ముందే ఓ ప్రముఖ కంప‌నీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసేసింది. దీంతో చిత్ర నిర్మాత స‌ద‌రు కంప‌నీపై ప‌రువు న‌ష్టంగా 25 కోట్లు అడుగుతున్నారు. `మాస్ట‌ర్` చిత్రాన్ని రిలీజ్‌కి ముందే ఆన్‌లైన్‌లో లీక్ చేసి పైర‌సీ చేసినందుకు గానూ చిత్ర నిర్మాత ఈ మొత్తాన్ని న‌ష్ట‌ప‌రిహారంగా డిమాండ్ చేస్తున్నార‌ట‌.

- Advertisement -

`మాస్ట‌ర్‌` రిలీజ్‌కి ముందు ఈ  మూవీ కాపీని విదేశాల‌కు పంపించ‌మ‌ని అందిస్తే స‌ద‌రు సంస్థ‌కు చెందిన వ్య‌క్తి `మాస్ట‌ర్‌` చిత్రాన్ని బిట్‌లు బిట్లుగా ఆన్‌లైన్‌లో లీక్ చేశాడు. దీనిపై ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్రేక్ష‌కుల‌కు విజ్ఞ‌ప్తి కూడా చేశారు. పైరసీ చేసిన ప్రింట్ వాట్సాప్ గ్రూపుల్లో వైర‌ల్ అవుతోంద‌ని, అలా వ‌చ్చిన క్లిప్‌ల‌ని ఫార్వ‌ర్డ్ చేసి మంచి చిత్రాన్ని కిల్ చేయ‌వ‌ద్ద‌ని విజ‌య్ అభిమానుల‌కు లోకేష్ క‌న‌గ‌రాజ్ విజ్ఞ‌ప్తి చేసిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All