Homeటాప్ స్టోరీస్మాస్ ఎంబీ ప్రతి సోమవారం రచ్చ చేస్తాడుట

మాస్ ఎంబీ ప్రతి సోమవారం రచ్చ చేస్తాడుట

మాస్ ఎంబీ ప్రతి సోమవారం రచ్చ చేస్తాడుట
మాస్ ఎంబీ ప్రతి సోమవారం రచ్చ చేస్తాడుట

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలవుతోన్న విషయం తెల్సిందే. అయితే నెల క్రితం నుండి ఈ సినిమాకు ప్రమోషన్స్ సరిగా లేవని మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందడం మొదలుపెట్టారు. ఒకవైపు అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్రానికి ప్రమోషన్స్ భీభత్సంగా జరుగుతుండడం, సరిలేరు నీకెవ్వరు నుండి ఏ అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన సమంజసమే అనిపించింది. అయితే ప్రస్తుతం పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఒక్క టీజర్ తో సరిలేరు నీకెవ్వరు టీమ్ రచ్చ లేపింది. ఈ టీజర్ అప్లోడ్ అయ్యి 100 గంటలు దాటినా కూడా ఇంకా టాప్ లోనే ట్రెండ్ అవుతోంది. అప్పుడే 25 మిలియన్ వ్యూస్ కు చేరువైంది. మరోవైపు అల వైకుంఠపురములో నుండి వచ్చిన మూడో పాట ఓ మై గాడ్ డాడీ అనుకున్నంత రెస్పాన్స్ రాబట్టకపోవడంతో తొలిసారి సరిలేరు నీకెవ్వరు పైచేయి సాధించినట్లైంది.

ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం సరిలేరు నీకెవ్వరు చిత్ర నిర్మాత అనిల్ సుంకర ప్రమోషన్స్ పై ఆసక్తి ఉన్నవాళ్లు, వినూత్న పద్దతిలో ప్రమోషన్స్ చేయగలమన్న ఆశ ఉన్నవాళ్లు తమను సంప్రదించమని, తమతో కలిసి పనిచేసే అవకాశమిస్తామని చెప్పిన విషయం తెల్సిందే. ఇప్పుడు దానికి తగ్గట్లుగా వినూత్న పద్దతిలో సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జరగబోతున్నాయి. ఇప్పటికే అదిరిపోయే టీజర్ తో ప్రమోషన్స్ కు తెరలేపిన సరిలేరు నీకెవ్వరు బృందం ఇకపై ప్రతి సోమవారం ఏదొక అప్డేట్ తో రచ్చ లేపబోతోందిట. #MassMBMondays పేరుతో నిన్న ఒక హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేసి అప్డేట్ ఏంటో ఊహించండి అంటూ సరిలేరు నీకెవ్వరు బృందం ఫ్యాన్స్ ను ఊరించింది. హ్యాష్ ట్యాగ్ ను చూసిన ఎవరైనా ఇది కచ్చితంగా సరిలేరు గురించి అప్డేట్ విషయంలోనిదని, ఈ లెక్కన ప్రతి సోమవారం ఏదొక అప్డేట్ ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు అని అర్ధం చేసుకోవచ్చు.

- Advertisement -

సరిలేరు నీకెవ్వరు జనవరి 11న విడుదలవుతున్న నేపథ్యంలో, ఈ మధ్య కాలంలో మొత్తం 6 సోమవారాలు ఉన్నాయి. అంటే ఈ 6 సోమవారాలు 6 అప్డేట్స్ ను ప్లాన్ చేశారన్నమాట. ఇందులో థియేట్రికల్ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సొంగ్స్ ఇవన్నీ ఉండనున్నాయి. మరి ఏ సోమవారం ఏ ప్రమోషనల్ అప్డేట్ ప్లాన్ చేసారో తెలీదు. ప్లాన్ మొత్తం ముందే ఇచ్చేస్తారా లేక ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ ఇస్తారా అన్నది కూడా చూడాలి. మొత్తానికి ఏదైతేనేం, మహేష్ ఫ్యాన్స్ కరువు తీరి ప్రమోషన్స్ లో రచ్చ లేపుతోంది ఈ చిత్రం.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. అనిల్ సుంకర నిర్మాణంలో దిల్ రాజు సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరి ఈ చిత్రం మహేష్ కు మరో విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All