విజయవంతమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న మారుతి ప్రస్తుతం గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. మరోవైపు మారుతి ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ కోసం కథలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ హెడ్ గా ఉన్న ఆహా చాలా త్వరగానే తెలుగు వారి ఫెవరెట్ ఓటిటి ప్లాట్ ఫామ్ గా మారిపోయింది.
అల్లు అరవింద్ కొంత మంది యువ దర్శకులతో ఆహా కోసం కథలు అందించేలా ఒప్పందం చేసుకున్నాడు. మెగా ఫ్యామిలీతో ముఖ్యంగా అల్లు ఫ్యామిలీతో మంచి ర్యాపో ఉన్న దర్శకుడు మారుతి కూడా ఈ డీల్ లో భాగమే. ఆహా కోసం రెండు వెబ్ సినిమాల కోసం కథలు సిద్ధం చేసాడట మారుతి.
- Advertisement -
అయితే వీటిని ఇతను డైరెక్ట్ చేయడు. మారుతి శిష్యులకు ఈ అవకాశం రానుంది. వీటికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే బయటకు రానుంది.
- Advertisement -