మెగా మేనల్లుడు సాయిధరమ్తేజ్ హీరోగా రూపొందిన చిత్రం `ప్రతిరోజు పండగే`. మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ బ్యానర్స్పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సాయిధరమ్తేజ్ కెరీర్లోనే భారీ వసూళ్లని సాధించిన చిత్రంగా నిలిచింది. తొలి రెండు వారాల తరువాత అంతగా ప్రభావం చూపిస్తుందా అని అనుమానించిన ట్రేడ్ వర్గాలనే ఈ చిత్రం విస్మయానికి గురిచూస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఈ సినిమా అందించిన ఉత్సాహంలో వున్న దర్శకుడు మారుతి తన తదుపరి చిత్రానికి రెడీ అయిపోతున్నాడు. ఈ చిత్రానికి కూడా మెగా హీరోనే కన్ఫమ్ చేసుకున్నట్టు తెలిసింది. మెగా కంపౌండ్లో ఇప్పటికే భలే భలే మగాడివోయ్, కొత్త జంట, తాజాగా ప్రతిరోజు పండగే` చిత్రాలతో వరుసగా హిట్ చిత్రాల్ని అందించారు. మెగా కాంపౌండ్ సెంటిమెంట్ వరుసగా వర్కవుట్ అవుతుండటంతో మారుతి తన తదుపరి చిత్రాన్ని కూడా మెగా హీరోతోనే ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్తేజ్కు మారుతి కథ వినిపించారట. లైన్ నచ్చడంతో వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఫిల్మ్ సర్కిల్స్లో వార్తలు షికారు చేస్తున్నాయి. వరుణ్తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న చిత్రంలో బాక్సర్గా కనిపించనున్న విషయం తెలిసిందే.