Homeటాప్ స్టోరీస్మారుతి మ‌ళ్లీ మెగా హీరోనే ప‌ట్టేశాడుగా?

మారుతి మ‌ళ్లీ మెగా హీరోనే ప‌ట్టేశాడుగా?

మారుతి మ‌ళ్లీ మెగా హీరోనే ప‌ట్టేశాడుగా?
మారుతి మ‌ళ్లీ మెగా హీరోనే ప‌ట్టేశాడుగా?

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా రూపొందిన చిత్రం `ప్ర‌తిరోజు పండ‌గే`. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. న‌వంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం సాయిధ‌ర‌మ్‌తేజ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని సాధించిన చిత్రంగా నిలిచింది. తొలి రెండు వారాల త‌రువాత అంత‌గా ప్ర‌భావం చూపిస్తుందా అని అనుమానించిన ట్రేడ్ వ‌ర్గాల‌నే ఈ చిత్రం విస్మ‌యానికి గురిచూస్తూ క‌లెక్ష‌న్‌ల వ‌ర్షం కురిపిస్తోంది.

ఈ సినిమా అందించిన ఉత్సాహంలో వున్న ద‌ర్శ‌కుడు మారుతి త‌న త‌దుప‌రి చిత్రానికి రెడీ అయిపోతున్నాడు. ఈ చిత్రానికి కూడా మెగా హీరోనే కన్ఫ‌మ్ చేసుకున్న‌ట్టు తెలిసింది. మెగా కంపౌండ్‌లో ఇప్ప‌టికే భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, కొత్త జంట‌, తాజాగా ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రాల‌తో వ‌రుస‌గా హిట్ చిత్రాల్ని అందించారు. మెగా కాంపౌండ్ సెంటిమెంట్ వ‌రుస‌గా వ‌ర్క‌వుట్ అవుతుండ‌టంతో మారుతి త‌న త‌దుప‌రి చిత్రాన్ని కూడా మెగా హీరోతోనే ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

- Advertisement -

ఇటీవ‌లే మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌కు మారుతి క‌థ వినిపించార‌ట‌. లైన్ న‌చ్చ‌డంతో వ‌రుణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని, ఈ చిత్రాన్ని బ‌న్నీవాసు నిర్మించే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వార్త‌లు షికారు చేస్తున్నాయి. వ‌రుణ్‌తేజ్ ప్ర‌స్తుతం కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌పైకి రాబోతున్న చిత్రంలో బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All