మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్`. ప్రఖ్యాత రచయిత కల్కీ కృష్ణమూర్తి నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాలని ప్రయత్నాలు చేసిన మణిరత్నం ఎట్టకేలకు లైకా ప్రొడక్షన్స్ అధినేత అల్లిరాజా సుభాస్కరన్ తో కలిసి ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. విక్రమ్, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.
గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ని మద్రాస్ టాకీస్ ఆఫీషియల్గా రిలీజ్ చేసింది. పోస్టర్లో ఖడ్గాన్ని మాత్రమే చూపిస్తూ టైటిల్ని రివీల్ చేశారు. స్వర్ణయుగాన్ని వెండితెరపై వీక్షించేందుకు అంతా సిద్ధంగా వుండండి` అంటూ ఆ ఫొటోలని ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఓ ఫొటోలో టైటిల్ని, మరో ఫొటోలో సినిమాకు సంబంధించిన సాంకేతిక వర్గాన్ని పరిచయం చేశారు. అయితే అందులో ప్రముఖ గేయరచయిత వైరముత్తు పేరు లేకపోవడం పలువురిని ఆశ్చర్యాన్ని కలిగించింది.
లైంగిక ఆరోపణల కారణంగా వైరముత్తుని `పొన్నియిన్ సెల్వన్` చిత్రం నుంచి తొలగించాలని గాయని చిన్మయి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా సంచలన ప్రకటనలు చేస్తూ చిత్ర బృందాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆమె డిమాండ్కి తలొగ్గి రచయితల సంఘం వైరముత్తును `పొన్నియిన్ సెల్వన్` నుంచి తొలగించాలని దర్శకుడు మణిరత్నంకు సూచించారట. దాంతో ఆయన అధికారికంగా వైరముత్తును తన సినిమా నుంచి తొలగించారని ప్రచారం జరిగింది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల లిస్టులో వైరముత్తు పేరుని తొలిగించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.