Homeటాప్ స్టోరీస్ఆ డైరెక్టర్ అంటే భయపడుతున్నారు

ఆ డైరెక్టర్ అంటే భయపడుతున్నారు

మణిరత్నం గొప్ప దర్శకుడే కానీ వరుసగా అపజయాలు పలకరిస్తుండటంతో అతడితో సినిమా చేయడానికి ఎవరు సాహసం చేస్తారు ? అందుకే పలువురు హీరోలు మణిరత్నం తో సినిమా అంటే భయపడిపోతున్నారు . దాంతో అవమానంగా భావించిన మణిరత్నం మామూలు వాళ్ళని పెట్టేసి భారీ మల్టీస్టారర్ చిత్రం అంటూ ప్రకటన జారీ చేసాడు . శింబు , విజయ్ సేతుపతి , అరవింద్ స్వామి , అరుణ్ విజయ్ , ప్రకాష్ రాజ్ , జయసుధ , జ్యోతిక , ఐశ్వర్య , అదితిరావు హైదరీ , డయానా లు కీలక పాత్రలు పోషిస్తున్నారు .

శింబు హీరోగా ఇప్పుడు సక్సెస్ లో లేడు , విజయ్ సేతుపతి మాత్రం వరుస హిట్స్ కొడుతున్నాడు ఇక మిగతా వాళ్ళ సంగతి తెలిసిందే . స్టార్ హీరోలతో సినిమా అనుకున్నాడు మణిరత్నం కానీ వాళ్ళు ఎవరూ మందుకు రాకపోవడంతో వీళ్ళని పెట్టి తీయడానికి రెడీ అయిపోయాడు . లైకా ప్రొడక్షన్స్ సహా భాగస్వామి గా ఈ సినిమా తెలుగు , తమిళ బాషలలో రూపొందనుంది . తెలుగులో ” నవాబ్ ” గా తమిళ్ లో ” చెక్క చివంత వానమ్ ” టైటిల్ తో తెరకెక్కనుంది . ఫిబ్రవరి 12న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All