హీరో మంచు విష్ణు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. చిరుతో కలిసి వున్న ఫొటోని సోషల్ మీడియా ట్విట్టర్లో పంచుకున్నారు మంచు విష్ణు. `ఈ రోజు బిగ్బాస్ కలిశాను. ఎందుకు కలిశాను అనేది త్వరలోనే వెల్లడిస్తాను. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను` అని ట్వీట్ చేశారు మంచు విష్ణు. దీంతో వీరిద్దరి కలయిక పై ఇండస్ట్రీతో పాటు మీడియాలోనూ ఊహాగానాలు మొదలయ్యాయి.
ఎందుకు కలిశాను అన్నది త్వరలో వెల్లడిస్తానని మంచు విష్ణు సస్పెన్స్లో పెట్టడంతో ఎవరికి తోచింది వారు ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు `మోసగాళ్లు` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీచిన్ దర్శకత్వం వహిస్తున్నారు. అమెరికాలో జరిగిన భారీ సాఫ్ట్ వేర్ కుంభకోణం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఇందులో మంచు విష్ణుకు చెల్లెలుగా కీలక పాత్రలో నటిస్తోంది.
త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ ఈవెంట్ కు చిరును ముఖ్య అతిథిగా ఆహ్వానించడం కోసమే మెగాస్టార్ను మంచు విష్ణు కలిశారని వార్తలు వినిపిస్తుండగా.. చిరు నటిస్తున్న మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` రీమేక్లో మంచు విష్ణు `పృధ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో నటించే అవకాశం వుందని, ఆ కారణంగానే చిరుని మంచు విష్ణు కలిశారంటూ మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ ఊహాగానాలకు తెరపడాలంటే మంచు విష్ణు ఈ మీట్ వెనకున్న అసలు రహస్యాన్ని బయటపెట్టాల్సిందే.