Homeటాప్ స్టోరీస్మెగాస్టార్‌ని మంచు విష్ణు ఎందుకు క‌లిశారు?

మెగాస్టార్‌ని మంచు విష్ణు ఎందుకు క‌లిశారు?

మెగాస్టార్‌ని మంచు విష్ణు ఎందుకు క‌లిశారు?
మెగాస్టార్‌ని మంచు విష్ణు ఎందుకు క‌లిశారు?

హీరో మంచు విష్ణు మెగాస్టార్ చిరంజీవిని క‌లిశారు. ప్ర‌స్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. చిరుతో క‌లిసి వున్న ఫొటోని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో పంచుకున్నారు మంచు విష్ణు. `ఈ రోజు బిగ్‌బాస్ కలిశాను. ఎందుకు క‌లిశాను అనేది త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాను. ఆయ‌న నుంచి ఎంతో నేర్చుకున్నాను` అని ట్వీట్ చేశారు మంచు విష్ణు. దీంతో వీరిద్ద‌రి క‌ల‌యిక పై ఇండ‌స్ట్రీతో పాటు మీడియాలోనూ ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

ఎందుకు క‌లిశాను అన్న‌ది త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాన‌ని మంచు విష్ణు స‌స్పెన్స్‌లో పెట్ట‌డంతో ఎవ‌రికి తోచింది వారు ఊహించుకుంటున్నారు. ప్ర‌స్తుతం మంచు విష్ణు `మోస‌గాళ్లు` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి  హాలీవుడ్ డైరెక్ట‌ర్ జెఫ్రీ గీచిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అమెరికాలో జ‌రిగిన భారీ సాఫ్ట్ వేర్ కుంభ‌కోణం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇందులో మంచు విష్ణుకు చెల్లెలుగా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

- Advertisement -

త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీ ఈవెంట్ కు చిరును ముఖ్య అతిథిగా ఆహ్వానించ‌డం కోస‌మే మెగాస్టార్‌ను మంచు విష్ణు క‌లిశార‌ని వార్త‌లు వినిపిస్తుండ‌గా.. చిరు న‌టిస్తున్న మల‌యాళ హిట్ ఫిల్మ్ `లూసీఫ‌ర్‌` రీమేక్‌లో మంచు విష్ణు `పృధ్వీరాజ్ సుకుమార‌న్ పాత్ర‌లో న‌టించే అవ‌కాశం వుంద‌ని, ఆ కార‌ణంగానే చిరుని మంచు విష్ణు క‌లిశారంటూ మ‌రో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ ఊహాగానాల‌కు తెర‌ప‌డాలంటే మంచు విష్ణు ఈ మీట్ వెన‌కున్న అస‌లు ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All