Homeటాప్ స్టోరీస్ఈ.వీ.ఎం లపై నమ్మకం లేదన్న మంచు విష్ణు..!

ఈ.వీ.ఎం లపై నమ్మకం లేదన్న మంచు విష్ణు..!

Manchu Vishnu Comments EVM Machines MAA Elections
  

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల టైం దగ్గర పడుతున్న ఈ సమయంలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. మా ఎన్నికల్లో బ్యాలెట్ వినియోగం పై ప్రకాష్ రాహ్ ప్యాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మంచు విష్ణు కూడా ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఈ.వీ.ఎం లపై తమ ప్యానల్ సభ్యులకు నమ్మకం లేదని.. వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని మంచు విష్ణు ఆరోపించారు.

మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలి.. ఈ.వీ.ఎం లను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని.. ఈ.వీ.ఎం లపై తమ ప్యానల్ సభ్యులకు నమ్మకం లేదని అంటున్నారు మంచు విష్ణు. పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఈసారి మా పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారికి పంపించిన లేఖలో ప్రస్తవించారు. పేపర్ బ్యాలెట్ విధానంలో పారదర్శకత ఉంటుంది. ఈ.వీ.ఎం ల కంటే పేపర్ బ్యాలెట్ ఉత్తమమైందని అన్నారు. బ్యాలెట్ ద్వారా ఓటు వేసే ఆకాశం కలిపిస్తే సీనియర్ ఆర్టిస్టులు ఎక్కువ మంది తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ఉందని మంచు విష్ణు తన లేఖలో రాశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All