Homeటాప్ స్టోరీస్మనోజ్ అహం బ్రహ్మాస్మి మొదలైంది.. విశేషాలివే!

మనోజ్ అహం బ్రహ్మాస్మి మొదలైంది.. విశేషాలివే!

మనోజ్ అహం బ్రహ్మాస్మి మొదలైంది.. విశేషాలివే!
మనోజ్ అహం బ్రహ్మాస్మి మొదలైంది.. విశేషాలివే!

మంచు మనోజ్ దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత ముఖానికి రంగు వేసుకుంటున్న సినిమా అహం బ్రహ్మాస్మి. కెరీర్ పరంగా వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డ మనోజ్ తిరిగి ఫామ్ ను అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కెరీర్ లో ఇప్పటివరకూ భిన్నమైన సినిమాలకే పెద్ద పీట వేస్తూ వచ్చిన మనోజ్, రీ ఎంట్రీ పరంగా కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు.

సరికొత్త పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది. మనోజ్ ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ మీద నిర్మించనున్నాడు. అహం బ్రహ్మాస్మి ఈరోజు ఉదయం లాంచ్ అయింది. మూవీ రామ్ చరణ్ చేతుల మీదుగా మొదలవ్వడం విశేషం. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను మంచు మనోజ్ షేర్ చేసుకున్నాడు. ప్రియా భవాని శంకర్ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈమె ఇప్పటికే చినబాబు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయముంది. తమిళంలో వైభవ్ హీరోగా వచ్చిన మెయ్యాదమాన్ తో ఆమె హీరోయిన్ గా పాపులర్ అయింది. ఇక విలన్ గా సముద్రఖనిని తీసుకున్నారు. ఇటీవలే అల వైకుంఠపురములో చిత్రంతో సముద్రఖని డైరెక్ట్ తెలుగు సినిమా చేసాడు. రవితేజ సరసన క్రాక్ లో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు అహం బ్రహ్మాస్మికి కూడా ఓకే చెప్పాడు.

- Advertisement -

శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. భిన్నమైన ఎమోషన్స్ ను కలగలిపిన చిత్రంగా ఇది ఉంటుందని మనోజ్ నమ్ముతున్నాడు. అచ్చు రాజమణి సంగీత దర్శకుడు. మంచు మనోజ్ ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించనున్న విషయాన్ని ఇప్పటికే రివీల్ చేసాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలవనుంది.

అందుకనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయంలో మనోజ్ వేరే భాషల వారిని తీసుకుంటున్నాడు. హీరోయిన్, విలన్ విషయంలో తమిళ వాళ్ళను తీసుకున్న మనోజ్, మరి హిందీ, మలయాళ, కన్నడ నటులను కూడా చేర్చుకుంటాడేమో చూడాలి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు వెళ్లనుంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All