Homeటాప్ స్టోరీస్టీటీడీకి యంగ్ హీరో సూటి ప్ర‌శ్న‌!

టీటీడీకి యంగ్ హీరో సూటి ప్ర‌శ్న‌!

టీటీడీకి యంగ్ హీరో సూటి ప్ర‌శ్న‌!
టీటీడీకి యంగ్ హీరో సూటి ప్ర‌శ్న‌!

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా యావ‌త్ ప్ర‌పంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్ కార‌ణంగా ప‌లువురికి ఉద్యోగాలు పోవ‌డంతో సామాన్య జ‌నం ఇబ్బందులు ప‌డుతున్నారు. ప‌ని లేక, రాబ‌టి రాక నిత్యం అవ‌స్త‌లు ప‌డుతున్నారు. ఇదిలా వుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం టీటీడీకి సంబంధించిన నిర‌ర్ధ‌క ఆస్తుల్ని వేలం వేస్తున్నామంటూ ప్ర‌క‌టించింది.

దీనిపైలో పెద్ద రాజ‌కీయ దుమారమే చెల‌రేగుతోంది. దీనిపై ఇప్ప‌టికే బీజేపీతో స‌హా చాలా వ‌ర‌కు పార్టీలు వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైతం ఈ విష‌యంపై ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే ప్ర‌య‌త్నం చేశారు. తాజాగా యంగ్ హీరో ఈ వివాదంపై స్పందించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

- Advertisement -

మంచు మనోజ్ టీటీడీ నిర‌ర్ధ‌క ఆస్తుల అమ్మ‌కంపై స్పందించారు. టీటీడీ ఆస్తులు అమ్మ‌మ‌ని దేవుడేమ‌న్నా చెప్పాడా?.. క‌రోనా సంక్షోభంలో రోజుకు ల‌క్ష మందికి ఆక‌లి తీర్చ‌మ‌ని కూడా దేవుడు ఏమ‌న్నా చెప్పాడా? చ‌ఏసేది, చెప్పేది అంతా టీటీడీ పాల‌క‌మండ‌లి. ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న ఆస్తుల్ని, కొండ‌కి వ‌చ్చిన ల‌క్ష‌లాది మందిని, సుప్ర‌భాత సేవ‌కి టైమ్ అయ్యింది నిద్ర లేవాలి. అని శ్రీ‌హ‌రిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాల‌క మండ‌లి. కొండ‌పై వున్న వ‌డ్డీ కాసుల వాడి ఆస్తుల అమ్మాకానికి వ‌చ్చాయి అంటే “గోవిందా గోవిందా“ అని అర‌చిన ఈ గొంతు కొంచెం త‌డ‌బ‌డింది.

మోసం జ‌ర‌గ‌ట్లేదు అని తెలుసు. ఎందుకంటే ఇన్‌సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా వేలం వేసి అంద‌రి ముందు అంద‌రు చూస్తుండ‌గానే అమ్మ‌కం జ‌రుపుతారు. కానీ ఎందుకు అమ్ముతున్నారు? అని పాల‌క మండ‌లి కాస్త వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వివ‌ర‌ణ మాత్ర‌మే. ఏమీ లేదు సార్‌. ఇంత పెద్ద కొండ మాకు అండ‌గా వుంది అని చూస్తూ మురిసిపోయే తిరుప‌తి వాడిని కాబ‌ట్టి ఆపుకోలేక అడుగుతున్న సార్‌. అంటే జైహింద్` అంటూ ఓ బ‌‌హిరంగ లేఖ‌ని మంచు మ‌నోజ్ విడుద‌ల చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All