భారీ సెట్టింగుల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ గుణశేఖర్. `రుద్రమదేవి` వంటి చారిత్రక చిత్రం తరువాత గుణశేఖర్ కొంత విరామం తీసుకున్నారు. ఈ సమయంలో రానాతో తెరకెక్కించాలనుకున్న మైథలాజికల్ చిత్రం `హిరణ్యకశ్యిప` చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో అమెరికాలో బిజీగా గడిపారు. దీనికి మరింత సమయం అవసరం వుండటంతో ఆ స్థానంలో `శాకుంతలం` చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు.
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై అత్యంత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్ర శకుంతలగా స్టార్ హీరోయిన్ సమంతని చిత్ర బృందం ఇటీవల ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సెట్స్ వర్క్ ఇటీవలే స్టార్టయింది. దీంతో మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై దర్శకుడు గుణశేఖర్ కసరత్తులు మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో సమంతకు జోడీగా ఈ చిత్రంలో నటించే మెయిన్ లీడ్ని ఎంపిక చేసినట్టు తెలిసింది. కాళిదాసు రచించిన `అభిజ్ఞాన శాకుంతలం` ఆధారంగా ఈ చిత్నాన్ని తెరకెక్కిస్తున్న గుణశేఖర్ ఈ చిత్రంలోని మెయిన్ లీడ్ పాత్ర కోసం మలయాళ నటుడు దేవ్ మోహన్ని ఎంపిక చేసినట్టు తెలిసింది. దుశ్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్టు తెలిసింది.