ముంబై మహానగరాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇక్కడ రోజు రోజుకీ ప్రమాద కర స్థాయిలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో ఆదివారం ఒక్క రోజే 7 వేల కేసులు బయటపడటం కలవరానికి గురిచేస్తోంది. ఈ కేసుల్లో ముంబైది అగ్ర భాగం కావడంతో వణికిపోతున్న జనం బయట అడుగుపెట్టడానికి జంకుతున్నారు. కరోనా వైరస్ రోజు రోజుకూ ముంబైలో రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో అత్యవసరమైతే కానీ బయటికి రాకూడదని ప్రభుత్వం హెచ్చిరికలు జారీ చేసింది.
దీంతో బాలీవుడ్ వర్గాలు బయటికి రావడానికి సాహసించడం లేదు. ఇంటి పట్టునే వుంటూ సోషల్ మీడియాలో బిజీగా వుంటున్నారు. కొంత మంది వంటింటి చిట్కాలు మొదలుపెడుతున్నారు. బాలీవుడ్ హాట్ ఐటమ్ బాంబ్ మలైకా అరోరా లాక్డౌన్ దగ్గరి నుంచి ఫిజికల్ ఫిట్నెస్పై దృష్టిపెడుతోంది. యోగాసనాలు చేస్తూ ఆ ఫొటోల్ని వీడియోల్ని బాలీవుడ్ సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి మలైకా కొత్త చిట్కాలని చెబుతుండటం ఆసక్తి కరంగా మారింది. వంటింట్లో వుండే పసుపు, అల్లం, ఆపిల్, వెనిగర్, పెప్పర్ని ఉపయోగించి కషాయాన్ని తయారు చేసుకోవచ్చని, దాని ద్వారా కరోనాని కట్టడి చేయవచ్చని, ఇది అద్భుతమైన ఫలితాల్ని అందిస్తోందని, దీన్ని వాడటం వల్ల కరోనా మీ దరికి రాదని చెబుతోంది. మలైకా చిట్కాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మలైకా చిట్కాని చాలా మందే ఫాలో అవుతున్నారట.