Homeటాప్ స్టోరీస్భారీ ధరకు అమ్ముడుపోయిన మేజర్ ఓవర్సీస్ హక్కులు

భారీ ధరకు అమ్ముడుపోయిన మేజర్ ఓవర్సీస్ హక్కులు

భారీ ధరకు అమ్ముడుపోయిన మేజర్ ఓవర్సీస్ హక్కులు
భారీ ధరకు అమ్ముడుపోయిన మేజర్ ఓవర్సీస్ హక్కులు

అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం మేజర్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒరిజినల్ గా ఈ చిత్రాన్ని జులై 2న విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మేజర్ విడుదల ఇప్పుడు వాయిదా పడింది. 26/11 ముంబై అటాక్స్ లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ ను తెరకెక్కించారు.

తెలుగు, హిందీతో పాటు ఈ సినిమా మలయాళంలో కూడా విడుదల కానుంది. శశి కిరణ్ తిక్కా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం మేజర్ ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

- Advertisement -

వీకెండ్ సినిమా, సదరన్ స్టార్ ఇంటర్నేషనల్ తో కలిసి ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులను భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. శాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల మేజర్ లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All