Homeటాప్ స్టోరీస్ఎవరు మీలో కోటీశ్వరులు: మహేష్ కోసం మూడు ప్రోమోలు దింపుతున్నారు!

ఎవరు మీలో కోటీశ్వరులు: మహేష్ కోసం మూడు ప్రోమోలు దింపుతున్నారు!

mahesh special episode for ntrs evaru meelo koteeswarulu has three promos
mahesh special episode for ntrs evaru meelo koteeswarulu has three promos

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల మధ్య మంచి బాండింగ్ ఉంది. భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ విచ్చేసిన విషయం తెల్సిందే. మహేష్, తారక్, చరణ్ లు ముగ్గురూ తరచుగా పార్టీల్లో కలుసుకుంటూనే ఉంటారు. వీరి భార్యలు కూడా మంచి స్నేహితులు.

ఇప్పుడు ఎన్టీఆర్ తో ఉన్న ఆ స్నేహం కారణంగానే ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కు అతిథిగా వచ్చాడు మహేష్. ఒక పిక్ లీకవడంతో ఈ న్యూస్ రెండు వారాల క్రితమే అందరికీ తెలిసిపోయింది. అయితే ప్రస్తుతం మహేష్ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోలు కూడా సిద్ధం చేస్తున్నారట. మొత్తంగా మూడు ప్రోమోలు విడుదల చేసి ప్రమోషన్ ను పీక్స్ కు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

- Advertisement -

దసరా సందర్భంగా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. ఏ తేదికి అన్నది రేపో, ఎల్లుండో తెలిసిపోతుంది. మొదటి ప్రోమోతో ఆ విషయాన్ని తెలియజేస్తారు. మహేష్ ఇలాంటి షో కు రావడం ఇదే తొలిసారి. మరి ఈ నేపథ్యంలో మహేష్ తో ఉండగా ఎన్టీఆర్ హోస్టింగ్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షో కు రేటింగ్స్ బాగా తగ్గాయి. అయితే ఈ ఎపిసోడ్ తో సరికొత్త రికార్డులను నెలకొల్పాలని జెమినీ టివి భావిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All