స్టార్ హీరో సూపర్స్టార్ మహేష్ నటించిన చిత్రం `భరత్ అనే నేను`. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చూఏరువైంది బాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ కియారా అద్వానీ. `లస్ట్ స్టోరీస్`తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కియారా `కబీర్సింగ్` తరువాత బాలీవుడ్లో హాట్ ఫేవరేట్గా మారిపోయింది. బాలీవుడ్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ఈ సోగకళ్ల సోయగం ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్లతో బిజీ బిజీగా గడిపేస్తోంది.
బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాతో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తోందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రియుడు సిద్ధార్ధ్ మల్హొత్రాతో కలిసి స్టార్స్ క్రేజీ వెకేషన్ మాల్దీవ్లకు చెక్కేసింది. అయితే తాను ఎవరితో డేటింగ్లో లేనని, ప్రస్తుతం సింగిల్గానే వున్నానని చెబుతున్న కియారా మాల్దీవుల్లో తరు హాట్ హాట్గా విహరిస్తున్న ఫొటోలని ఇన్స్టాలో షేర్ చేస్తూ అభిమానులకు మరింత కిక్ ఇస్తోంది.
మాల్దీవుల్లోని మిడ్-సీ విల్లాస్లో విహరిస్తూ టూ పీస్ బికినీలతో నెటిజన్స్ని టీజ్ చేస్తోంది. సముద్రపు అలలపై ఏర్పాటు చేసిన నెట్పై పడుకుని టూ పీస్ బికినీ ధరించిన కియారా ఫొటోలో నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. శీతాకాలంలో అంతా చలికి వణికిపోతున్న వేళ తన హాట్ పిక్స్తో ఇన్ స్టాని హీటెక్కిస్తోంది. ప్రస్తుతం కియారా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.