చిత్రసీమలో చాలామార్పులే చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరోలు..ఇతర హీరోల సినిమాల కోసం తమ సినిమాల రిలీజ్ లు నిలిపివేయడం…ఒకరి చిత్ర ప్రమోషన్ లో మరొక హీరో పాల్గొనడం..ఆ సినిమా కు హైప్ వచ్చేలా ట్వీట్స్ చేయడం వంటివి చేస్తున్నారు. అలాగే ఇతర హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , రానా కలయికలో తెరకెక్కిన భీమ్లా నాయక్ మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటె తాజాగా టాలీవుడ్ లో ఓ వార్త వైరల్ గా మారింది. అదేంటి అంటే..ప్రభాస్ కోసం మహేష్ మాట సాయం చేయబోతున్నాడట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ మూవీస్ తో ఫుల్ బిజీ గా ఉన్నారు. ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరికొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ మూవీ తో మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగు తో పలు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర విశేషాలు బయటకు వస్తూ అభిమానుల్లో అంచనాలు పెంచుతుంది.
తాజాగా ఈ మూవీ హిందీ వర్షన్ కు గాను అమితాబ్ తన వాయిస్ ఓవర్ను అందించారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు రాధా కృష్ణ, హీరోయిన్ పూజా హెగ్డే తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక తెలుగు వర్షన్ కు సంబదించిన మహేష్ తన వాయిస్ ను ఇస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే రాధే శ్యామ్ కు మరింత హైప్ పెరగడం ఖాయం. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రానికి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభాస్ కోసం మాట సాయం చేసాడట.
ప్రస్తుతం మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దీంతో వీలు చూసుకుని రికార్డింగ్ స్టూడియోకు వస్తానని ప్రభాస్కు హామీ ఇచ్చాడట. అంటే ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చి మొదటి వారంలో ఈ పని పూర్తి చేయబోతున్నాడని తెలుస్తోంది.