కరోనా వైరస్ కారణంగా ంతా ఇంటి పట్టునే వుంటున్నారు. లాక్డౌన్ విధించిన దగ్గరి నుంచి షూటింగ్లు కూడా ప్యాకప్ చెప్పేయడంతో స్టార్ హీరో సూపర్స్టార్ మహేష్ ఇంటి పట్టునే వుంటున్నారు. గత కొంత కాలంగా వరుస షూటింగ్లతో బిజీ బిజీగా గడిపేసిన మహేష్బాబు కరోనా కారణంగా షూటింగ్లు నిలిచిపోవడంతో ఇంటి పట్టునే వుంటూ తనయుడు గౌతమ్, కూతురు సితారతోనే ఎక్కువ సమయాన్నిగడిపేస్తున్నారు.
పిల్లలతో కలిసి సినిమాలు చూడటంతోపాటు వారితో కలిసి గేమ్స్ ఆడేస్తున్నారు. తాజాగా మహేష్బాబు తన తనయుడు గౌతమ్తో హైట్ గేమ్ ఆడారు. తండ్రి కొడుకుల మధ్య హైట్ చెక్ గేమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గౌతమ్ ఎదురుగా నిల్చుని సరదాగా హైట్ చెక్ చేసుకుంటున్న ఓ వీడియోని సూపర్స్టార్ మహేష్ షేర్ చేశారు. ఆరడుగు మహేష్ హైట్కి ఏమాత్రం తీసిపోని స్థాయిలో గౌతమ్ వుండటం మహేష్ ఫ్యాన్స్ సూపర్ ఇట్స్ కూల్, లాక్డౌన్ డైరీస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
గౌతమ్ వయసు ప్రస్తుతం 14 ఇయర్స్. ఈ టీనేజ్ దాటితే మమస్త్రష్ హైట్ని దాటేయడం ఖాయంగా కనిపిస్తోందనరి ఫ్యాన్స్ అంటున్నారు. ఇదిలా వుంటే `సరిలేరు నీకెవ్వరు` చిత్రం తరువాత మహేష్ నెక్ట్స్ మూవీని పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున లాంఛనంగా ప్రారంభం కాబోతోంది.
Credit: Instagram