Homeగాసిప్స్మహేష్ బాబు దృష్టి ఆ రెండు సినిమాలపైనే

మహేష్ బాబు దృష్టి ఆ రెండు సినిమాలపైనే

Mahesh has two options infront
Mahesh has two options infront

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. గత రెండు, మూడేళ్ళ నుండి మహేష్ తన సినిమాల ఎంపిక పట్ల స్పష్టమైన మార్పును చూపిస్తున్నాడు. రిస్కులు తీసుకోవడానికి అస్సలు మహేష్ ఇష్టపడట్లేదు. అలాగే మినిమమ్ గ్యారంటీ అనుకున్న కథలను పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటివరకూ ఈ నిర్ణయం మహేష్ కు మంచే చేసింది. గత మూడు సినిమాలు మహేష్ నుండి వచ్చినవి హిట్స్ గా నిలిచాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ పూర్తి చేసిన మహేష్ ఇప్పుడు నాలుగో సినిమాను కూడా హిట్ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు.

అందుకే తొందర పడకుండా తన నెక్స్ట్ సినిమాకు మూడు నెలల గ్యాప్ ఇచ్చాడు. అయితే వంశీ పైడిపల్లితో అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు హోల్డ్ లో పడింది. దీని ప్లేస్ లో ఏ సినిమా చేయాలా అని మహేష్ చాలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు మహేష్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి అందరూ అనుకుంటున్నట్లు పరశురామ్ తో సినిమా రేసులో ఉంది. మే 31 నుండి సినిమా లాంచ్ ఉంది అన్నారు, అయితే అది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కాకుండా భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతో సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నాడు. వెంకీ కుడుముల కూడా ఇటీవలే ఒక లైన్ చెప్పగా దానికి మహేష్ కూడా ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మన్నాడట. ఈ రెండు ఆప్షన్స్ లో నుండి ఒకటి తీసుకుంటాడని తెలుస్తోంది. ఏదైనా కూడా మే 31కి లాంచ్ చేసి జూన్ నుండి షూటింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడట. మరి ఆ ప్రకారంగా ఈ ఇద్దరు దర్శకులలో ఒకరు మహేష్ సినిమాను చేజిక్కించుకోనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All