Homeటాప్ స్టోరీస్SSMB28 కోసం ప్లాన్ మార్చిన మ‌హేష్‌?

SSMB28 కోసం ప్లాన్ మార్చిన మ‌హేష్‌?

SSMB28 కోసం ప్లాన్ మార్చిన మ‌హేష్‌?
SSMB28 కోసం ప్లాన్ మార్చిన మ‌హేష్‌?

సాధారణంగా ఒకేసారి ఒక సినిమాని మాత్ర‌మే సెట్స్‌పైకి తీసుకెళుతుంటారు సూపర్ స్టార్ మహేష్. అయితే SSMB28 కోసం త‌న‌ ప్లాన్‌ని మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. క‌రోనా మహమ్మారి త‌గ్గుద‌ల‌ని  బట్టి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన త‌రువాత మళ్లీ షూటింగులు య‌దావిధిగా ప్రారంభించాల‌ని హీరోలంతా ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో మ‌హేష్ మాత్రం ఒకేసారి రెండు చిత్రాలని స‌మాంత‌రంగా పూర్తి చేయాల‌నుకుంటున్నార‌ట‌. మ‌హేష్ ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `సర్కారు వార పాట` చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీతో పాటు త్రివిక్ర‌మ్‌తో చేయాల‌నుకుంటున్న SSMB28ని త్వ‌ర‌లో ప‌ట్టాలెక్కించ‌బోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌. రాధాకృష్ణ నిర్మించ‌నున్న ఈ మూవీని సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజైన ఈ నెల 31న లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించ‌బోతున్నారు.

- Advertisement -

వ‌న్స్ కోవిడ్ అదుపులోకి వ‌చ్చిన వెంట‌నే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇంత‌కు ముందు మ‌హేష్ ఇదే త‌ర‌హాలో భ‌ర‌త్ అనే నేను` మూవీని చేశారు. ఇప్పుడు అదే ఫార్ములాని తాజా రెండు చిత్రాల‌కు అమ‌లు చేయాల‌నుకుంటున్నార‌ట‌. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే మేక‌ర్స్ వెల్ల‌డించ‌బోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All