మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం మహర్షి . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు . కాగా షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తిచేసుకున్న ఈ సినిమా ఔట్ పుట్ పట్ల మహేష్ అసంతృప్తి వ్యక్తం చేసాడట . సినిమాలో కొన్ని సన్నివేశాలను మళ్ళీ షూట్ చేయాల్సిందే అని గట్టిగానే చెప్పాడట . దాంతో రీ షూట్ తప్పనిసరి అని తెలుస్తోంది .
రీ షూట్ అంటే ఏప్రిల్ 25 న సినిమా రిలీజ్ ఉంటుందా ? అన్న అనుమానం నెలకొంది . ఇప్పటికే పలుమార్లు డేట్ లను మార్చుకుంది మహర్షి చిత్రం . ఇక ఇప్పుడేమో రీ షూట్ అంటే సకాలంలో వస్తుందా ? అన్న అనుమానం నెలకొంది . మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు .
English Title: Mahesh babu’s Maharshi in re shoot mode