సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయనున్నాడు. వీరిద్దరూ గతంలో అతడు, ఖలేజా సినిమాలు చేసారు. ఈ రెండు చిత్రాలు కూడా కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాయి. మళ్ళీ 11వ సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది.
హారిక అండ్ హాసిని బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని, సమ్మర్ 2022లో చిత్రం విడుదలవుతుందని అధికారికంగా తెలియజేసారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెండు ఆసక్తికర విషయాలు ఈ నెలలో విడుదల కాబోతున్నాయని సమాచారం. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా రెండు కీలకమైన అప్డేట్స్ ను ఇవ్వనున్నారు.
ఈ చిత్ర టైటిల్ ను మే 31న విడుదల చేస్తారు. టైటిల్ లోగోతో చిత్ర థీమ్ గురించి కూడా ఒక ఐడియా వచ్చేలా మోషన్ పోస్టర్ ను వదలనున్నారు. అలాగే ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ విషయంలో కూడా అప్డేట్ ఇవ్వనున్నారు. అన్ని త్రివిక్రమ్ సినిమాల్లో లానే ఈ చిత్రంలో కూడా ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తోంది.