మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ”1” నేనొక్కడినే చిత్రం చేసిన విషయం తెలిసిందే . అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది , పైగా ఆ చిత్రం లో మహేష్ తో పాటుగా మహేష్ తనయుడు కూడా నటించాడు . కానీ అట్టర్ ప్లాప్ కావడంతో మహేష్ తో పాటుగా ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు . కట్ చేస్తే మళ్ళీ ఇన్నాళ్లకు సుకుమార్ తో సినిమా చేయడానికి మహేష్ అంగీకరించాడు .
రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు సుకుమార్ . 1980 నాటి కథతో సంచలన విజయం అందుకున్న సుకుమార్ తో పలువురు అగ్ర హీరోలు సినిమా చేయాలనీ భావిస్తున్నారు కానీ సుకుమార్ మాత్రం మహేష్ తో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడు పైగా రంగస్థలం వంటి చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రావడం విశేషం . మరో విశేషం ఏంటంటే మహేష్ తో శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ని అందించారు మైత్రి సంస్థ . అయితే అప్పుడంటే మిస్ ఫైర్ అయ్యింది మరి ఇప్పుడైనా సుకుమార్ మహేష్ కు బ్లాక్ బస్టర్ ఇస్తాడా చూడాలి .