Homeటాప్ స్టోరీస్కెజిఎఫ్ దర్శకుడ్ని కలిసిన మాట వాస్తవమే అంటున్న మహేష్

కెజిఎఫ్ దర్శకుడ్ని కలిసిన మాట వాస్తవమే అంటున్న మహేష్

కెజిఎఫ్ దర్శకుడ్ని కలిసిన మాట వాస్తవమే అంటున్న మహేష్
కెజిఎఫ్ దర్శకుడ్ని కలిసిన మాట వాస్తవమే అంటున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి విపరీతమైన ప్రమోషన్లు చేస్తున్న సంగతి తెల్సిందే. టీవీ మీడియాకు ఇంటర్వ్యూలు ఎడాపెడా ఇచ్చేస్తూ సినిమాను నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నాడు. పోటీగా మరో భారీ సినిమా ఉండడంతో మహేష్ ఎక్కడా తగ్గాలనుకోవడంలేదు. ఓపెనింగ్స్ సంక్రాంతి సినిమాలకు చాలా ముఖ్యం కాబట్టి అందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాడు. మహేష్ బాబు ఇంటర్వ్యూలలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

అందులో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చర్చ కూడా ఉంది. తన తర్వాతి సినిమా వంశీ పైడిపల్లితో ఉంటుందని ఖరారు చేసాడు మహేష్. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉండడంతో మహేష్ మూడు నెలలు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాడు. సమ్మర్ లో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం తర్వాత మరో సినిమా ఏదీ అంగీకరించలేదని క్లారిటీ ఇచ్చాడు మహేష్.

- Advertisement -

అయితే గతేడాది కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కదా అంటే దాని గురించి కూడా స్పందించాడు. తనకు, ప్రశాంత్ నీల్ కు మధ్య మీటింగ్ జరిగిన మాట వాస్తవమేనని అన్నాడు మహేష్. తమ మధ్య కథా చర్చలు కూడా నడిచాయని, అయితే దానర్ధం తాము సినిమా చేసేస్తున్నట్లు కాదని, అయితే ఈ విషయంలో క్లారిటీ రావడానికి మరింత సమయం పడుతుందని అంటున్నాడు.

కెజిఎఫ్ చిత్రం తనకెంతో నచ్చిందని, కెజిఎఫ్ 2 కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నానని కూడా అన్నాడు. ప్యాన్ ఇండియా చిత్రాల్లో కెజిఎఫ్ చాలా స్పెషల్ గా నిలిచిన విషయం తెల్సిందే. విడుదలైన అన్ని భాషల్లో ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. మహేష్ కూడా ప్యాన్ ఇండియా కథ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో నిజంగా కథ సెట్ అయితే మాత్రం అది మాములుగా ఉండదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All