Homeటాప్ స్టోరీస్`స‌రిలేరు... `కి మ‌హేష్ పారితోషికం ఎంత‌?

`స‌రిలేరు… `కి మ‌హేష్ పారితోషికం ఎంత‌?

Mahesh Babu Remunaration for Sarileru Neekevvaru
Mahesh Babu Remunaration for Sarileru Neekevvaru

ఈ మ‌ధ్య స్టార్ హీరోలు పారితోషికం తీసుకోవ‌డం లేదు. ఆ స్థానంలో వాటాలు అడుగుతున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ద‌గ్గ‌రి నుంచి ఎన్టీఆర్ వ‌ర‌కు అంతా వాటాల పాటే పాడుతున్నారు. తాజాగా సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రాల విష‌యంలోనూ ఇదే ప‌ద్ద‌తిని హీరోలు పాటించారు. పర్సంటేజ్ ఇస్తేనే సినిమా చేస్తాన‌నే కండీష‌తో మ‌హేష్ అనిల్ సుంక‌ర‌కి `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రాన్ని చేసి పెట్టార‌ట‌. పైగా దీనికి వ‌న్ ఆఫ్ ది నిర్మాత‌గా కూడా మ‌హేష్ పేరు వేసుకున్నారు కూడా.

ఈ సంక్రాంతికి జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లనే సొంతం చేసుకుంది. అనిల్ సుంక‌ర 75 కోట్ల‌తో నిర్మించిన ఈ చిత్రం ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 300 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు తెలిసింది. టాక్ ప‌రంగా, క‌లెక్ష‌న్‌ల ప‌రంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ఈ చిత్రం ఇండ‌స్ట్రీ హిట్ అనిపించుకుంది. ఈ సినిమాకి మ‌హేష్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. వ‌చ్చిన లాభాల్లో వాటాని మాత్ర‌మే కోరిన‌ట్టు తెలిసింది. దీంతో నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ మాత్రమే మ‌హేష్ సొంతం చేసుకున్నార‌ట‌.

- Advertisement -

దీనికి గానూ మహేష్‌కి దాదాపు 82 కోట్లు మిగిలిన‌ట్టు వార్త‌లు వినిపిస‌తున్నాయి. ఒక్కో సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు 20 కోట్లు మాత్ర‌మే తీసుకుంటూ వ‌చ్చిన మ‌హేష్ `స‌రిలేరు..` చిత్రానికి గానూ పారితోషికం నూపంలో 82 కోట్లు ద‌క్కించుకోవ‌డం ప‌లువురిని ఆశ్చర్మానికి గురిచేస్తోంది. మ‌హేష్ త్వ‌ర‌లో వంశీ పైడిప‌ల్లితో ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్‌లో లాంఛ‌నంగా ప్రారంభం కాబోతోంది. దీనికి దిల్ రాజు నిర్మాత‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All