సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు మొదలయ్యేదాకా ఎవరితో ఉంటుందో సరిగ్గా చెప్పలేని పరిస్థితి. సరిలేరు నీకెవ్వరు ముందు సుకుమార్ తో సినిమా చేయాలి కానీ ఎఫ్ 2 చూసి వెంటనే అనిల్ తో సినిమాను పట్టాలెక్కించేసాడు మహేష్. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుతో విజయాన్ని అందుకుని వంశీ పైడిపల్లితో తన తర్వాతి చిత్రం ఉంటుందని ప్రకటించిన మహేష్ ఆ విషయంలో కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ – వంశీ సినిమా పూర్తిగా స్క్రాప్ అయిపోయినట్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. వంశీ చెప్పిన ఫైనల్ నరేషన్ పట్ల సంతృప్తిగా లేనందువల్లే ఇలా జరిగిందని అంటున్నారు.
అయితే ఈ సినిమాలో ప్లేస్ లో మహేష్ పరశురామ్ తో ప్రాజెక్ట్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ముందు అందరూ దీన్ని గాలి వార్త అనుకున్నారు కానీ తర్వాత అదేం కాదని నిజంగానే మహేష్ పరశురామ్ ను పిలిచి ఫుల్ స్క్రిప్ట్ మీద పనిచేయమని అడిగినట్లు తెలుస్తోంది. గతంలోనే పరశురామ్ మహేష్ కు లైన్ చెప్పగా నచ్చినా కానీ దాన్ని హోల్డ్ లో పెట్టాడు. ఇప్పుడు అవకాశం దొరకడంతో పరశురామ్ ప్రాజెక్ట్ ను ముందుకు జరిపాడు.
తాజా సమాచారం ప్రకారం పరశురామ్ తో మహేష్ చేయబోయే చిత్రం జూన్ లో పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. మహేష్ తో తీసిన శ్రీమంతుడు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఐతే పరశురామ్ జూన్ నుండే నాగ చైతన్యతో సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో తెరకెక్కించాల్సి ఉంది. అయితే మహేష్ తో సినిమా అవకాశం రావడంతో వాళ్ళు కూడా అర్ధం చేసుకుని ముందు మహేష్ తోనే ప్రొసీడ్ అవ్వమని చెప్పినట్లు తెలుస్తోంది.
మరి పరశురామ్ అయినా మహేష్ ను తన ఫైనల్ నరేషన్ తో ఒప్పిస్తాడో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అప్పుడే కొంత క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈలోగా మహేష్ మరో హాలిడేకు వెళ్తాడని సమాచారం.