ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్ కథా చిత్రాలు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే . అయితే రాయలసీమ కథా చిత్రాలకు డిమాండ్ తగ్గింది దాంతో ఆ చిత్రాల హవా తగ్గింది కట్ చేస్తే మళ్ళీ రాయలసీమ చిత్రాల హవా మొదలయినట్లు ఉంది ప్రస్తుతం ఎన్టీఆర్ – త్రివిక్రమ్ లు కూడా రాయలసీమ నేపథ్యంలోనే సినిమా చేస్తున్నారు . కట్ చేస్తే ఇప్పుడు మహేష్ బాబు కూడా రాయలసీమ నేపథ్యంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట .
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అగ్ర నిర్మాతలు అశ్వనీదత్ – దిల్ రాజు లు సంయుక్తంగా నిర్మించనున్నారు ఈ చిత్రాన్ని . మహేష్ బాబు ఇంతకుముందే రాయలసీమ నేపథ్యంలో ఒక్కడు అనే సినిమా చేసాడు , అది బ్లాక్ బస్టర్ అయ్యింది అంతేకాదు మహేష్ బాబు ని స్టార్ హీరో ని చేసింది కూడా . కట్ చేస్తే దశాబ్దం తర్వాత రాయలసీమ నేపథ్యంలో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు అయితే ఇది పూర్తిగా రాయలసీమ నేపథ్యం కాదు అమెరికాలో ఎక్కువ భాగం ఉంటుంది కాబట్టి ఫ్రెష్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది .