Homeగాసిప్స్జగన్ కు మహేష్ కావాలనే లేటుగా థాంక్స్ చెప్పాడా..?

జగన్ కు మహేష్ కావాలనే లేటుగా థాంక్స్ చెప్పాడా..?

Mahesh Babu has thanked YS Jagan for the new G.O
Mahesh Babu has thanked YS Jagan for the new G.O

ఏపీలో టికెట్ ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో ను సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. టికెట్ ధరలు పెంచుకోవచ్చు అనగానే హమ్మయ్య అనుకున్నారు కానీ దానికి ఓ మెలిక పెట్టేసరికి ఏంచేయాలో అర్థంకావడం లేదు. ప్రస్తుతం పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న క్రమంలో థాంక్స్ తప్ప ఇంకేం చెప్పలేమని వరుసపెట్టి మీడియా సమావేశాలు , ట్విట్టర్ లలో జగన్ కు థాంక్స్ చెపుతున్నారు. అయితే ప్రభుత్వం పెట్టినమెలిక ఏంటి అంటే..వందకోట్ల సినిమాలకే ఈ అనుమతులు వస్తాయని చెప్పి , అందులో హీరో, హీరోయిన్ రెమ్యూనరేషన్లు రావొద్దని చెప్పారు. అలాగే ఏపీలో 20 శాతం షూటింగ్ చేస్తేనే రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో కొత్త జీవో చెత్తగా ఉందని వారిలో వారే అనుకుంటున్నారు తప్ప బయటకు చెప్పడం లేదు.

ఈ సంగతి పక్కన పెడితే చిరంజీవి తో పాటు నిర్మాతల మండలి జగన్ తీసుకొచ్చిన జీవో ఫై థాంక్స్ చెప్పగా..కాస్త ఆలస్యంగా మహేష్ స్పందించారు. మా బాధలు విని, వాటికి తగ్గట్టుగా ఈ కొత్త జీవో ఇచ్చినందుకు సీఎం జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మున్ముందు కూడా ఇలానే ఆరోగ్య కరమైన వాతావరణంలో ప్రభుత్వం, చిత్రపరిశ్రమ ఎంతో సమన్వయంతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను.. పేర్ని నాని గారికి థ్యాంక్స్ అని మహేష్ బాబు ట్వీట్ వేశాడు. ప్రభాస్ , రాజమౌళి మొదలగు వారు మాత్రం సైలెంట్ గా ఉన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All