హీరో మహేష్ బాబు కు వీరాభిమాని అయిన ఎర్రంశెట్టి రాజీవ్ కరెంట్ షాక్ తో చనిపోయాడు దాంతో మహేష్ బాబు అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన నిన్న రాత్రి జరిగింది . ఈరోజు భారీ ఎత్తున మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం విడుదల అవుతుండటంతో మహేష్ అభిమానుల కోలాహలం తో థియేటర్ లన్నీ దద్దరిల్లిపోతున్నాయి .
- Advertisement -
థియేటర్ లను అందంగా డెకరేట్ చేయడం , ఫ్లెక్షీ లను ఏర్పాటు చేయడం చేస్తుంటారు అభిమానులు . అలాగే ఎర్రంశెట్టి రాజీవ్ అనే మహేష్ బాబు వీరాభిమాని థియేటర్ వద్ద ఫ్లెక్షీ లను ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో మృతి చెందాడు . దాంతో ఎర్రంశెట్టి రాజీవ్ కుటుంబం విషాదంలో మునిగింది . అభిమాన హీరో సినిమా విడుదల అవుతోంది అన్న సంతోషం ఆవిరైపోయి రాజీవ్ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచెత్తింది
- Advertisement -