Homeగాసిప్స్‌మ‌హేష్‌తో మ‌రోసారి మిల్కీ బ్యూటీ!

‌మ‌హేష్‌తో మ‌రోసారి మిల్కీ బ్యూటీ!

Mahesh and tamanna team up once again
Mahesh and tamanna team up once again

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు తో క‌లిసి మ‌రోసారి త‌మ‌న్నా న‌టిస్తోంది. గ‌తంలో వీరిద్ద‌రూ క‌లిసి `ఆగ‌డు` చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే. మ‌హేష్‌కు జోడీగా త‌మన్నా న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత కొన్నేళ్ల‌కి వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన చిత్రం `స‌రి లేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించి మెస్మ‌రైజ్ చేసింది.

గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ‌అయితే తాజాగా మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి న‌టించ‌బోతున్నారు. అయితే ఈ సారి సినిమా కోసం కాకుండా క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కోసం కావ‌డం గ‌మ‌నార్హం. `అర్జున్‌రెడ్డి` ఫేమ్ సందీప్‌రెడ్డి వంగ స్టార్ హీరో మ‌హేష్‌తో క‌మ‌ర్ష‌య‌ల్ యాడ్‌ని రూపొందించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -

ఈ యాడ్‌లో మ‌హేష్‌తో క‌లిసి త‌మ‌న్నా కూడా న‌టించ‌బోతోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ ప్రారంభ‌మైంది. హ‌వెల్స్ బ్రాండ్ కోసం ఈ యాడ్ క‌మర్షియ‌ల్‌ని షూట్ చేస్తున్నారు. ఈ యాడ్ కోసం మ‌హేష్‌, త‌మ‌న్నాల‌కు భారీ పారితోష‌కం అందిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All