దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ కలిసి నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల చేయానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత రాజమౌళి, మహేష్ ల కలయికలో భారీ చిత్రం వుంటుందనే వార్తలు గత కొన్ని నెలలుగా వినిపిస్తున్నాయి.
పలు టీవీ లైవ్ షోలల్లో రాజమౌళి కూడా ఈ ప్రాజెక్ట్ వుంటుందని కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మూవీని ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఈ మూవీని భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అక్టోబర్లో `ఆర్ ఆర్ ఆర్` రీలీజ్ కానున్న నేపథ్యంలో అదే నెలలో ఈ ప్రాజెక్ట్ని ప్రకటిస్తారని టాక్.
మహేష్, రాజమౌళిల కాంబినేషన్లో రానున్న సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కిది నిజంగా ఆనందించదగ్గ వార్తే. మహేష్ ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్లో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది.