కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మహానటి . సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల ప్రశంసలతో పాటుగా విమర్శకు ప్రశంసలు అలాగే పలు అవార్డులు , రివార్డులు వరించాయి . గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రానికి తాజాగా మరో అరుదైన గౌరవం లభించింది . షాంగై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు మహానటి చిత్రం ఎంపికయ్యింది . ఈ విషయాన్నీ తాజాగా ధ్రువీకరించారు మహానటి టీమ్ .
సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి బయోపిక్ చిత్రాల్లోనే ఓ మైలురాయిగా నిలిచింది . సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి చిత్రంతో అగ్ర నిర్మాత అశ్వనీదత్ మళ్ళీ నిర్మాతగా నిలబడ్డాడు . వరుస పరాజయాల బాట నుండి బయటపడి తన కీర్తిని రెపరెపలాడించాడు . మహానటి చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు . విజయ్ దేవరకొండ – సమంత జంటగా ఈ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే .