దర్శకుడు సురేందర్ రెడ్డి మెచ్చిన మథనం
దర్శకుడు సురేందర్ రెడ్డి మథనం టీజర్ ని విడుదల చేసారు . మథనం సినిమా చూశానని , బాగుందని తప్పకుండా ప్రేక్షకులను అలరించే సినిమా అవుతుందని అంటున్నాడు సురేందర్ రెడ్డి . శ్రీనివాస్ సాయి , భావన రావు జంటగా నటించిన ” మథనం ” చిత్రానికి అజయ్ సాయి మణికందన్ దర్శకత్వం వహించాడు . దివ్యా ప్రసాద్ – అశోక్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ సురేందర్ రెడ్డి కి బాగా నచ్చిందట .
అంతేకాదు సినిమా కూడా కొంత భాగం చూశానని చాలా బాగుందని తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నాడు . అశోక్ నాకు ఎప్పటినుండో పరిచయం , అమెరికా వెళ్లి బాగానే సంపాదించాడు . నాతో కూడా సినిమా నిర్మిస్తాడని అనుకుంటున్నా అంటూ మథనం చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశాడు సురేందర్ రెడ్డి . నిజంగానే సురేందర్ రెడ్డి చెప్పినట్లు మథనం టీజర్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది మరి .